సినిమా ఇండస్ట్రీలో “ఆ నలుగురు” ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాక చస్తుంటే.. ఇప్పుడు కొత్తగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ వచ్చి ఆ నలుగురు కాదు, ఆ ఇద్దరు అంటూ కొత్త కన్ఫ్యూజన్ కి తెర లేపారు. పోనీ ఆ ఇద్దరు ఎవరు అనే క్లారిటీ ఇచ్చారా అంటే లేదు. విషయం ఏంటంటే.. థియేటర్ల బంద్ అంటూ క్రియేట్ అయిన ఇష్యూకి ఎవ్వరికీ సంబంధం లేదని, ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ను (Pawan Kalyan) ఎవరో మిస్ గైడ్ చేశారని దిల్ రాజు (Dil Raju) మొన్నామధ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే.. ఇదే విషయమై స్పందించిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ.. పవన్ కళ్యాణ్ ను కన్ఫ్యూజ్ చేసిన ఆ ఇద్దరు దర్శకులు మరియు ఇద్దరు నిర్మాతలు అంటూ స్టేట్మెంట్ ఇచ్చి కొత్త కన్ఫ్యూజన్ కి దారి తీశారు. మరి ఆ ఇద్దరు ఎవరు అనే విషయంలో క్లారిటీ వస్తుందో లేదో తెలియదు కానీ..
ఇండస్ట్రీలో ఏ ఇద్దరు నిర్మాతలకు సయోధ్య లేదని మాత్రం స్పష్టమవుతుంది. మొన్న పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యేసరికి ఎవరికి వారు మాకు సంబంధం లేదు అంటే మాకు సంబంధం అంటూ వేర్వేరుగా ప్రెస్ మీట్లు పెట్టారే కానీ.. అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఒక సరైన సమాధానం మాత్రం ఇవ్వలేదు.
ఇప్పుడు కూడా థియేటర్ లీజు & రెంటల్ విషయంలో ఎవరు ఎటువైపు, ఏది మంచిది అనే విషయంలో ఒక యునైటెడ్ డెసిషన్ అనేది లేదు, రాదు కూడా. మరి ఇలా ప్రతి చిన్న విషయానికి కొట్టుకు చచ్చే ఇండస్ట్రీ పెద్దలు ఒక తాటి మీదకు వచ్చి, ఇండస్ట్రీ బాగు కోసం ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగేలా లేదు. ఇలాంటప్పుడే ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు ఎంత అవసరమో అర్ధమవుతుంది.