ఎన్టీఆర్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు దర్శకులు!

  • October 21, 2017 / 02:05 PM IST

జై లవకుశ  తో ఎన్టీఆర్ వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్నారు. సో టాలీవుడ్ దర్శకుల చూపు  ఎన్టీఆర్ పై పడింది. ఫుల్ స్వింగ్ లో ఉన్న తారక్ తో సినిమా చేసి హిట్ కొట్టేయాలని ఆశపడుతున్నారు. అయితే ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్టార్ డైరక్టర్ పవన్ మూవీని కంప్లీట్ చేయగానే ఎన్టీఆర్ సినిమాని ప్రారంభించనున్నారు.  ఈ సినిమా మొదలు కావడానికి మరో ఐదు నెలలు సమయం పట్టేలా ఉంది. అందుకే ఈ గ్యాప్ లో సినిమా పూర్తి చేయాలనీ సతీష్ వేగేశ్న దిల్ రాజు తో కలిసి గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. వీరిద్దరూ ఈ సంవత్సరం శతమానం భవతితో విజయం అందుకున్నారు. ఏడాది చివర్లో మరో హిట్ అందుకోవాలని తారక్ ని సంప్రదిస్తున్నారు.

అలాగే ఇష్క్‌”, “మనం”, “24 “… సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న విక్రమ్ కె కుమార్ హలో చిత్రీకరణలో బిజీగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ కోసం ఓ అద్భుతమైన కథ సిద్ధం చేసినట్లు సమాచారం. ఎప్పుడు అవకాశం ఇస్తారా.. అని విక్రమ్  వెయిటింగ్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.  పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాల దర్శకుడు అనిల్  రావిపుడి కూడా తారక్ తో సినిమా కోసం  గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.  మరి ఈ ముగ్గురులో తారక్ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus