పూజ, ఈషా రెబ్బతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్న కన్నడ బ్యూటీ

  • September 29, 2018 / 08:16 AM IST

వరుసగా నాలుగు హిట్లు .. ఆ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా అంటే సహజంగానే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. పైగా ఆ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకేముంది నందమూరి అభిమానులు మాత్రమే కాదు అందరికన్ను”అరవింద సమేత వీర రాఘవ”పై ఉంది. వారి అంచనాలకు మించి సినిమా ఉండేలా తెరకెక్కిస్తున్నారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలను ఇచ్చి ఆడియోని సూపర్ హిట్ చేయించారు. దీంతో సినిమాపై ఎనలేని క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఇందులో పూజా హెగ్డేతో పాటు ఈ చిత్రంలో తెలుగమ్మాయి ఈషా రెబ్బా నటిస్తున్న సంగతి తెలిసిందే.

వీరితో పాటు మరో భామ కూడా స్క్రీన్ షేర్  చేసుకోబోతున్నట్టు తెలిసింది. తెలుగులో “ఓమై గాడ్”, “అనగనగా ఒక చిత్రం”, “ఖాకీ”ల్లో కనిపించిన కన్నడ ముద్దుగుమ్మ మేఘ శ్రీ తాజాగా ఈ చిత్రంలో నటించినట్లుగా ఫిలిం నగర్ వాసులు చెప్పారు. త్రివిక్రమ్ తన సినిమాలో ప్రతి ఒక్కరికీ ప్రాముఖ్యత ఇస్తుంటారు. అదే విధంగా మేఘ శ్రీ కి మంచి రోల్ ఇచ్చి ఉంటారు. అది ఏ రోల్ అయి ఉంటుందా? అని ఆసక్తి పెరిగిపోతోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11న థియేటర్లోకి రానుంది. భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా అనేక రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus