భరత్ అనే నేనులోని క్లైమాక్స్ గురించి చెప్పిన కెమెరామెన్

  • January 24, 2018 / 08:11 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. కొత్త షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ కి దగ్గర్లో జరుగుతోంది. అక్కడ క్లైమాక్స్ సీన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాన్ని కెమెరా మెన్ తిరు కొత్తగా చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్నీ ఆయన సోషల్ మీడియా వేదికపై వెల్లడించారు. స్పాట్ లైట్స్ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ “క్లైమాక్స్ ఇలా ఉండబోతోంది” అని ట్వీట్ చేశారు. ఈ విషయం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. గతంలో కొరటాల శివ తీసిన జనతా గ్యారేజ్ లో ఫైట్స్ ని విభిన్నంగా తెరకెక్కించడంలో తిరు టెక్నీక్స్ ఉపయోగపడ్డాయి.

భరత్ అనే నేను సన్నివేశాలను తన కెమెరా కన్నుతో కొత్తగా బందిస్తారని అందరూ నమ్మకంతో ఉన్నారు. మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ జనవరి 26 న రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీ హిట్ శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus