హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న మూడు భారీ ప్రాజక్ట్ లు

  • July 3, 2017 / 01:46 PM IST

స్టార్ హీరోలు ఎండా, వాన అని లెక్క చేయడం లేదు. సినిమాపైనే దృష్టి పెట్టారు. సాధ్యమైనంతవరకు చిత్రాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. మరో రెండు రోజులో శంషాబాద్ కి షిఫ్ట్ కానుంది. అలాగే బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ షూటింగ్ నాన్ స్టాప్ గా సాగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో విలన్ పాత్ర ధారి రోనిత్ రాయ్, తారక్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. మహేష్ బాబు అయితే ఒక రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా శ్రమిస్తున్నారు.

ప్రస్తుతం  కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. నగర శివార్లలో వేసిన అసెంబ్లీ సెట్ లో చిత్రీకరణ సాగుతోంది. ఈ షూటింగ్ కి రేపటితో బ్రేక్ ఇచ్చి.. ఎల్లుండి (జులై 05 ) నుంచి స్పైడర్ పాట షూటింగ్ లో మహేష్ పాల్గొననున్నారు. ఈ షూటింగ్ 8 వ తేదీ వరకు సాగుతుంది. ఇలా స్టార్ హీరోలు వర్షాలను పట్టించుకోకుండా కలక్షన్ల వర్షం కురవాలని కష్టపడుతున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus