ఒకే వేదికపై టాలీవుడ్ సీనియర్ స్టార్స్.. ఏం జరిగిందంటే?

  • December 27, 2023 / 10:40 AM IST

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీనియర్ స్టార్ హీరోలంతా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. వెంకటేశ్ 75వ సినిమా సైంధవ్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటానని వెంకటేశ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

సైంధవ్ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేశ్ 75 సినిమాలు పూర్తి చేసిన సందర్భంగా ఒక ఫంక్షన్ జరగనుండగా ఈ కార్యక్రమానికి సంబంధించిన బాధ్యతలను రానా తీసుకున్నారు. టాలీవుడ్ హీరోలతో రానాకు మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఈ ఈవెంట్ కు చిరంజీవి, బాలయ్య, నాగ్ వచ్చేలా రానా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఒకే వేదికపై ఈ నలుగురు హీరోలను చూస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.

మరి కొందరు స్టార్ హీరోలు సైతం ఈ ఫంక్షన్ కు హాజరు కానున్నారని సమాచారం అందుతోంది. ఈ వేడుక హక్కులు ప్రముఖ ఓటీటీ సొంతమయ్యాయని ఆ ఓటీటీలో త్వరలో ఈ ఫంక్షన్ ప్రసారం కానుందని సమాచారం అందుతోంది. చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ కాంబోలో ఏ డైరెక్టర్ అయినా సినిమా ప్లాన్ చేస్తారేమో చూడాలి.

టాలీవుడ్ సీనియర్ హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. (Chiranjeevi) చిరంజీవి విశ్వంభర, బాలయ్య బాబీ కాంబీ మూవీ, నాగార్జున నా సామిరంగ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తున్నారు. సీనియర్ హీరోలు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus