19 ఏళ్ళ ‘మనసంతా నువ్వే’ చిత్రం గురించి మనకు తెలియని సీక్రెట్..!

  • October 19, 2020 / 03:30 PM IST

‘సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్’ బ్యానర్ పై ఎం.ఎస్.రాజు నిర్మాణంలో వి.ఎన్.ఆదిత్య డైరెక్ట్ చేసిన ‘మనసంతా నువ్వే’ చిత్రాన్ని ఎప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించిన ఈ చిత్రం 175రోజుల వరకూ విజయవంతంగా ఎన్నో కేంద్రాల్లో ఆడింది. ఉదయ్ కిరణ్ ను స్టార్ హీరోని చేసిన చిత్రమిది. ఆర్.పి.పట్నాయక్ సంగీతమందించిన ఈ చిత్రంలో తూనీగా తూనీగా, చెప్పవే ప్రేమ.. వంటి పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

చిన్నప్పుడే విడిపోయిన ప్రేమికులు పెద్దయ్యాక ఎలా కలుసుకున్నారు? అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.2001వ సంవత్సరం అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం ఈరోజుతో 19 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది. ఇదిలా ఉండగా.. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి హీరోగా ఉదయ్ కిరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే తరువాత ఆ అవకాశం ఉదయ్ కిరణ్ కు దక్కిందట. ‘మనసంతా నువ్వే’ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో మరెవరో కాదు.. మన సూపర్ స్టార్ మహేష్ బాబు.

2001 టైములో యం.ఎస్.రాజు నిర్మాణంలో మహేష్ ఓ చిత్రం చెయ్యడానికి కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ టైములో మన యం.ఎస్.రాజు గారు మహేష్ కు దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తో ‘మనసంతా నువ్వే’ కథను వినిపించారు. అయితే అప్పుడు మంచి కమర్షియల్ సినిమా చెయ్యాలని ఎదురుచూస్తున్న మహేష్.. ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడట. అలా అది ఉదయ్ కిరణ్ వద్దకు వెళ్ళింది. అటు తరువాత మహేష్- యం.ఎస్.రాజు నిర్మాణంలో ‘ఒక్కడు’ అనే బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చింది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus