‘తమిళ్ తలైవాస్’ జెర్సీ ఆవిష్కరణలో పాల్గొన్న స్టార్స్

  • July 20, 2017 / 01:45 PM IST

కబడ్డీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదవ సీజన్ కి చేరుకుంది. ఈ నెల 28 నుంచి మొదలయ్యే సీజల్లో తొలిసారి ‘తమిళ్‌ తలైవాస్‌’ జట్టు బరిలోకి దిగనుంది. విశ్వ నటుడు కమల్‌ హాసన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు,  భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సహ యజమానిగా ఉన్నారు. ‘తమిళ్‌ తలైవాస్‌’ జట్టు  జెర్సీని నేడు (గురువారం) చెన్నైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమల్‌ హాసన్, సచిన్‌లతోపాటు సినీ నటులు అల్లు అర్జున్, రామ్‌చరణ్‌ తేజ పాల్గొన్నారు.

‘తమిళ్‌ తలైవాస్‌’ జెర్సీ ధరించి ఆకట్టుకున్నారు. ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్‌ హైదరాబాద్‌లో తొలి కూతతో మొదలుకానుంది. ఆరంభ మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌తో ఆతిథ్య తెలుగు టైటాన్స్‌ పోటీ పడనుంది. అక్టోబర్‌ 28 న జరిగే ఫైనల్‌ మ్యాచ్ కి ముంబై ఆతిథ్యం ఇస్తుంది. 12 జట్లు పాల్గొనే ఈ సీజన్ ఆసక్తికరంగా మారింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus