టచ్ చేసి చూడు సినిమా గురించి బయటపెట్టిన సీరత్ కపూర్!

  • October 12, 2017 / 11:03 AM IST

సినిమాలకు ఏడాది బ్రేక్ ఇచ్చినా .. ఒకేసారి రెండు సినిమాలకు ఓకే చెప్పి పరుగు ప్రారంభించారు రవితేజ. వాటిలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న “రాజా ది గ్రేట్” సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. తొలిసారి మాస్ మహారాజ్  అంధుడిగా నటించిన ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన థియేటర్లోకి  రానుంది. ఇక విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో మొదలైన “టచ్ చేసి చూడు” సినిమా ఆగిపోయిందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. విక్రమ్ సిరికొండ టేకింగ్ బాగాలేదని రవితేజ సినిమాని ఆపేశారని టాక్. అయితే ఇందులో వాస్తవం లేదని సీరత్ కపూర్ స్పష్టం చేసింది.

ఆమె నటించిన రాజు గారి గది 2 రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె  “టచ్ చేసి చూడు” సినిమాలో తన పాత్ర గురించి బయటపెట్టింది. “టచ్ చేసి చూడులో నా పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది” అని వివరించింది. ఈమె మాటలు బట్టి చూస్తే “టచ్ చేసి చూడు” ఆగిపోలేదని అర్ధమవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus