Trisha: త్రిష పారితోషికం మళ్లీ పెరిగిందా.. ఎంత తీసుకుంటున్నారంటే?

  • April 1, 2024 / 03:26 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష (Trisha Krishnan) విజయవంతంగా చాలా సంవత్సరాల నుంచి కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష పారితోషికం ఇతర హీరోయిన్లతో పోల్చి చూస్తే ఇంతకాలం పాటు పరిమితంగా ఉండేది. అయితే ప్రస్తుతం త్రిష పారితోషికం ఏకంగా 12 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. ఈ రేంజ్ లో నయనతార (Nayanthara) కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. త్రిష వరుస విజయాలను సాధించడం వల్లే ఈ రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.

త్రిష నాలుగు పదుల వయస్సులో కూడా ఈ రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారంటే ఆమె టాలెంట్ కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మణిరత్నం (Mani Ratnam) డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ సిరీస్ త్రిష జాతకాన్ని, జీవితాన్ని మార్చేసిందని తెలుస్తోంది. పొన్నియిన్ సెల్వన్ సిరీస్ సక్సెస్ తో త్రిష కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ సినిమాలో త్రిష డామినేట్ చేయడం ఆమెకు కలిసొచ్చింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష తిరుగులేకుండా దూసుకెళుతున్నారు. భాషతో సంబంధం లేకుండా త్రిషకు ఆఫర్లు వస్తుండటం గమనార్హం. తెలుగులో సైతం విశ్వంభర (Vishwambhara) సినిమాలో ఆమె నటిస్తున్నారు. స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తుండటం ఆమెకు మరింత ప్లస్ అవుతోంది. కొన్ని నెలల క్రితం వరకు త్రిష పారితోషికం 6 కోట్ల రూపాయలుగా ఉండగా ఆ మొత్తాన్ని త్రిష రెట్టింపు చేసేశారు. నయనతార కూడా రాబోయే రోజుల్లో రెమ్యునరేషన్ పెంచుతారేమో చూడాల్సి ఉంది.

త్రిష, నయనతార మధ్య అప్పుడూ ఇప్పుడూ కోల్డ్ వార్ ఉందనే సంగతి తెలిసిందే. ఈ హీరోయిన్లు ఒకరి గురించి మరొకరు స్పందించడానికి ఇష్టపడరు. త్రిష ఈతరం హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. త్రిష రేంజ్ వేరే లెవెల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus