Trisha: ‘విశ్వంభర’ కొత్త లీక్‌… హీరోయిన్‌ విషయంలో కీలక నిర్ణయం!

  • March 11, 2024 / 12:47 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi)  – హిట్‌ దర్శకుడు మల్లిడి వశిష్ట (Vassishtha)  కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం (Vishwambhara) ‘విశ్వంభర’. ఈ సినిమా ఇటీవల మొదలైంది, ఇంకా రిలీజ్‌కి చాలా టైమ్‌ ఉంది. అయితే ఏమైందో ఏమో ఈ సినిమా నుండి రెగ్యులర్‌గా లీకులు, వార్తలు వస్తూనే ఉన్నాయి. చూస్తుంటే ఈ నెలలోనే, లేక వచ్చే నెలలోనే సినిమా రిలీజ్‌ అనేలా గాసిప్‌లు వచ్చేస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో చాలా అంశాలు కొద్దికొద్దిగా తెలుస్తున్నాయి. దీంతో సినిమా మీద ఆసక్తి పెరుగుతోంది. ఇలా తాజాగా బయటకు వచ్చిన విషయం త్రిష డ్యూయల్‌ రోల్‌.

అవును, ‘విశ్వంభర’ సినిమాలో త్రిష (Trisha)  డ్యూయల్‌ రోల్‌ చేస్తోంది. ఆ లెక్కన చిరంజీవి కూడా రెండు పాత్రల్లో కనిపిస్తాడా అనే ప్రశ్న మొదలైంది. ఈ సినిమాలో ముగ్గురు నాయికలు ఉంటారు అని ఇప్పటికే సమాచాం వచ్చింది. మరిప్పుడు త్రిష రెండు పాత్రల్లో అంటే.. మొత్తంగా నలుగురు హీరోయిన్లు ఉన్నట్లే. ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు చిరంజీవి – వశిష్ట. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో భీమరవ దొరబాబుగా చిరంజీవి కనిపిస్తారట.

ఈ కథలో త్రిష డ్యూయల్‌ రోల్‌లో కనిపిస్తోందని, రెండు పాత్రలూ ఒకదానికొకటి అస్సలు సంబంధం లేకుండా ఉంటాయి అంటున్నారు. ఇక మిగిలిన ఇద్దరు హీరోయిన్ల సంగతి తేలాల్సి ఉంది. అయితే ఇందులో చిరంజీవి చెల్లెళ్ల పాత్రల కోసం ఇప్పటికే సురభి, ఇషా చావ్లా తదితరుల్ని తీసుకున్నారు. వాళ్ల మీద సన్నివేశాల చిత్రీకరణ కూడా అవుతోందట. సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకు మాటల రచయితగా చేసిన బుర్రా సాయిమాధవ్‌ (Sai Madhav Burra) ఇటీవల ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. మరి ఆయన స్థానంలో ఎవరొచ్చారు అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఆయన ఎందుకు తప్పుకున్నారు అనే విషయం కూడా తేలాలి. గతంలో ఆయన(BRO) ‘బ్రో’ సినిమా నుండి ఇలానే తప్పుకున్నారనే విషయం తెలిసిందే.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus