శ్రీకాకుళం ప్రేక్షకుల కోసం త్రివిక్రమ్ సర్ప్రైజ్..!

  • January 6, 2020 / 06:33 PM IST

అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. పూజా హెగ్దే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నివేదా పేతురేజ్, సుశాంత్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక తమన్ సంగీతంలో రూపొందిన ఈ చిత్రం పాటలు ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. ‘సామాజవరగమన’ పాట అయితే చార్ట్ బస్టర్ గా నిలిచింది.

ఇక ‘ఓ మై గాడ్ డాడి’ ‘రాములో రాములా’ ‘బుట్టబొమ్మ’ పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ చిత్రం నుండీ మరోపాట రాబోతుందని సమాచారం. ఈ విషయాన్ని త్రివిక్రమ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ‘తెలంగాణ స్టైల్ లో ‘రాములో రాములా’.. కర్ణాటక స్టైల్ లో ‘సామాజవరగమన’ వంటి పాటలను విడుదల చేశాము. మన తెలుగుతనాన్ని చెప్పడానికి ఇదే రైట్ టైం..! త్వరలో శ్రీకాకుళం ప్రేక్షకులకి కూడా ఓ సర్ప్రైజ్ ఉండబోతుంది.” అంటూ చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్.


అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus