ప్లాన్ మార్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

  • August 21, 2018 / 07:42 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ “అరవింద సమేత వీర రాఘవ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ రెండు షేడ్స్ లో కనిపించబోతున్నారు. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ సంచలనం సృష్టించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 న వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. తొందరగా టాకీ పార్ట్ కంప్లీట్ చేసి సాంగ్స్ షూటింగ్ కోసం లండన్‌ కి వెళ్లాలని త్రివిక్రమ్ అనుకున్నారు. అక్కడ అందమైన ప్రాంతాల్లో రెండు పాటలను చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. కానీ టాకీ పార్టీ ఇంకా కంప్లీట్ కాలేదంటా.

ఎంత గ్యాప్ తీసుకోకుండా కష్టపడినప్పటికీ ఇంకా కొన్ని సీన్లు బ్యాలన్స్ ఉందంట. అందుకే హడావుడిగా కంప్లీట్ చేయడం కన్నా.. బాగా వచ్చే వరకు షూట్ చేయాలనీ త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారు. లండన్ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేశారని తెలిసింది. మహాబలేశ్వరంగానీ, కొచ్చిలో గానీ ఓ పాట తీసి, మరొకటి సెట్ సాంగ్‌గా మార్చేద్దామని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు కేరళ(కొచ్చి)లో వాతావరణం బాగోలేదు. సో మహాబలేశ్వరంలోనే పాట తీసే అవకాశం ఉంది. ఎలాగైనా అక్టోబర్ 11 న సినిమాని థియేటర్లోకి తీసుకురావాలని త్రివిక్రమ్ టీమ్ శ్రమిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus