ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఎవరితో ? 

  • September 1, 2016 / 10:09 AM IST

డైరక్టర్ అవుదామని రెండేళ్లుగా ఎదురు చూస్తున్న రచయిత వక్కంతం వంశీకి మరికొన్ని రోజులు ఎదురు చూపులు తప్పేలా లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయాలని అనుకున్నారు. వంశీ ఫుల్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అంతా ఒకే అనే సమయంలో వక్కంతం వంశీ కథ అడ్డం తిరిగింది. వీరిద్దరి మధ్యలోకి పూరి జగన్నాథ్ వచ్చినట్లు తాజా సమాచారం. ప్రస్తుతం పూరి కళ్యాణ్ రామ్ తో ఇజం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ షూటింగ్ సమయంలోనే నిర్మాత కళ్యాణ్ రామ్, హీరో ఎన్టీఆర్ ని పూరి తన కథ తో కన్విన్స్ చేసాడని తెలిసింది. టెంపర్ సినిమాకు సెక్వెల్ గా ఉండే కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చిందని, నిర్మాత కూడా నిర్మించడానికి సంతోషంగా అంగీకరించారని వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.
ఈ విషయం తెలుసుకున్న వక్కంతం వంశీ బాధతో ఎన్టీఆర్ టీమ్ నుంచి బయటికి వచ్చాడు. ఇదే విషయాన్నీ తారక్ ని అడగగా.. “వంశీ ఎక్కడికి వెళ్లిపోలేదు. అతని స్క్రిప్ట్ నా వద్దే ఉంది. డిస్కషన్ జరుగుతోంది. ఇంకా డిసైడ్ కాలేదంతే” అని వివరించారు. సినిమాకు సినిమాకు రేంజ్ పెంచుకుంటున్న ఈ సమయంలో కొత్త దర్శకుడితో ప్రయోగాల కంటే పూరితో సినిమా చేయడానికే ఎన్టీఆర్ ఆసక్తిగా ఉన్నట్లు సినీ ప్రముఖుల టాక్.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus