స్పెషల్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన ఉదయభాను

  • October 11, 2017 / 09:36 AM IST

బుల్లి తెరపై, వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన యాంకర్ ఉదయభాను కొంతకాలంగా షోలకు, సినిమాలకు దూరంగా ఉంది. ఆమెకు కవలలు పుట్టడంతో వారి అలనాపాలనలోనే సమయం గడిపింది. ఇప్పుడు మళ్ళీ బుల్లి తెర, వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తోంది. స్టార్ మాటీవీ లో డ్యాన్స్ ప్రోగ్రాం కి యాంకర్ గా చేస్తుండగా, త్రివిక్రమ్ సినిమాతో మళ్ళీ వెండితెరపై కనిపించనుంది. పవన్ కళ్యాణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అయితే ఈ వార్తలను ఉదయభాను ఖండించింది. తాను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి నిజమని అంగీకరించిన ఆమె, అది పవన్ కళ్యాణ్ సినిమాతో కాదని స్పష్టం చేసింది.

త్రివిక్రమ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించింది. కొంత కన్ఫ్యూజ్ గా ఉంది కదూ.. ఈ రెండు స్టేట్మెంట్స్ కరక్ట్. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ ని డైరక్ట్ చేస్తున్నారు. సీనియర్ నటి కుష్బూ, విక్టరీ వెంకటేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రంలో ఉదయ భాను స్పెషల్ సాంగ్ లేదు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా చేయనున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాలో ఉదయ భాను స్టెప్పులతో అదరగొట్టనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus