Krish-Vaishnav Tej: క్రిష్‌ – వైష్ణవ్‌ సినిమా పరిస్థితి ఇలా అయ్యిందేంటి?

  • May 10, 2021 / 09:51 AM IST

వైష్ణవ్‌ తేజ్‌ తొలి సినిమా ‘ఉప్పెన’ను ఓటీటీలో విడుదల చేస్తారంటూ తెగ వార్తలొచ్చాయి. అయితే చిత్రబృందం అన్నింటినీ ఎదుర్కొని.. మైత్రీ మూవీ మేకర్స్‌ నేరుగా థియేటర్లలో విడుదల చేసి హిట్‌ కొట్టారు. అయితే అనుకున్నట్లే సినిమా మంచి విజయాన్ని అందుకొని, కాసుల వర్షం కూడా కురిపించింది. ఇప్పుడు రెండో సినిమా కూడా అదే పని చేస్తుందా? లేక ఓటీటీలోకి వచ్చేస్తుందా? ఏమో మరి… సినిమా గురించి అయితే ఓటీటీ చర్చలు సాగుతున్నాయని టాక్‌. అవును క్రిష్‌ – వైష్ణవ్‌ సినిమాను ఓటీటీలోకి తెస్తారని టాక్‌.

‘కొండపొలం’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే ముగిసింది. గతేడాది కరోనా టైమ్‌లోనే చిత్రీకరణ ముగించేశారు. అయితే కరోనా తతగ్గాక కూడా సినిమా విడుదల గురించి క్రిష్‌ ఆలోచించలేదు. పవన్‌కల్యాణ్‌ సినిమా పనుల్లో బిజీ అయిపోయాడు. దీంతో సినిమా సంగతి పక్కకు పోయింది. ఈలోగా వైష్ణవ్‌ తన మూడో సినిమా మొదలుపెట్టేశాడు. అసలు సినిమా ఏమైంది… వస్తుందా… రాదా అనే డౌట్‌ కూడా చాలామందికి వచ్చింది. అయితే ఇప్పుడు ఏకంగా ఓటీటీకి ఇచ్చేస్తారనే టాక్‌ మొదలైంది.

‘ఆహా’లో ‘కొండపొలం’ వస్తుందనేది కొత్త టాక్‌. అంతేకాదు దీని కోసం అల్లు అరవింద్‌ టీమ్‌ ₹15 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమైందట. మరి క్రిష్‌ ఏం చేస్తాడనేది తెలియడం లేదు. ఈ సినిమాలో వైష్ణవ్‌ సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తుంది. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ‘కొండపొలం’ అనే నవల ఆధారంగానే ఈ సినిమా రూపొందింది. మరి తొలి సినిమాలాగే ఓటీటీ అనుకొని.. నేరుగా రిలీజ్‌ చేస్తారో, లేక ఓటీటీకి ఇచ్చేస్తారో చూడాలి.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus