NTR: తారక్ రియాలిటీ షో పై లేటెస్ట్ అప్ డేట్..?

  • April 23, 2021 / 03:06 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ ఛానెల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు షో మే నెల నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్, ఇతర కారణాల వల్ల ఈ షో వాయిదా పడింది. కరోనా కేసులు తగ్గితే జులై నెల నుంచి ఈ షో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షో ఆఫ్ లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఏపీలోని తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో ఈ రియాలిటీ షోలో పాల్గొనే లక్కీ పర్సన్స్ కోసం అడిషన్స్ జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడితే ఈ షో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 1ను హోస్ట్ చేసి ఆ షోకు ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చిన ఎన్టీఆర్ కు స్టార్ మా ఛానెల్ బిగ్ బాస్ సీజన్ 2ను కూడా హోస్ట్ చేయాలని ఆఫర్ ఇచ్చినా ఎన్టీఆర్ అంగీకరించలేదు. ఇప్పటికే విడుదలైన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమోలు షోపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గతంలోలా షూటింగులు జరిపే పరిస్థితులు లేకపోవడం, ఎవరు మీలో కోటీశ్వరులు లాంటి షోలకు ఆడియన్స్ ఇంపార్టెంట్ కావడంతో జులై వరకు ఈ షో ప్రసారమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడటంతో ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోను హోస్ట్ చేసిన నాగార్జున, చిరంజీవిలను మించి ఎన్టీఆర్ ఈ షోతో మెప్పిస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus