Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

బాక్సాఫీస్ దగ్గర అతిపెద్ద క్లాష్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ పాన్ ఇండియా మూవీ ‘దురంధర్ 2’ రెండూ మార్చి 19నే థియేటర్లలోకి వస్తున్నాయి.

Ustaad Bhagat Singh

ఒకటి సీక్వెల్ సినిమా అలాగే డబ్బింగ్ సినిమా,ఇంకోటి ఇండస్ట్రీ హిట్ కాంబోలో వస్తున్న సినిమా. అయితే అడ్వాన్స్ బుకింగ్స్‌లో మాత్రం ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఓ రేంజ్‌లో ఏర్పడింది.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినిమా పక్కన మరే సినిమా ఉన్నా… ఓపెనింగ్స్ కి మాత్రమే కాదు ధియేటర్ల కోసం కూడా కష్టపడాలి. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి మాత్రం ఆ సందడి మిస్ అయ్యింది. ఎందుకంటే ఈ సినిమా పై ఎందుకో జనాలకి ఆసక్తి లేదు. అందువల్ల ‘దురంధర్ 2’ కి హైప్ పెరిగింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి తెలంగాణాలో టికెట్ హైకులు వంటివి కూడా లభించలేదు. దీంతో ‘దురంధర్ 2’ డామినేషన్ ఎక్కువగా ఉంటుందేమో అని అంతా భావించారు.

కానీ హైదరాబాద్‌ సిటీ బుకింగ్స్‌ వరకు చూసుకుంటే పవన్ కళ్యాణ్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది.హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ రూ.1,43,73,370 మార్క్ దాటాయి. దేశవ్యాప్తంగా భారీ హైప్ ఉన్న ‘దురంధర్ 2’ మాత్రం రూ.1,42,89,780లతో పవన్ సినిమా వెనుకే నిలిచింది. దీంతో మోస్ట్ హైప్డ్ సీక్వెల్‌ను కూడా పవన్ డామినేట్ చేయడం విశేషంగానే చెప్పుకోవాలి.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన మాస్ ఎంటర్‌టైనర్‌ ‘ఉస్తాద్’కు.. తెలంగాణలో ఉదయం 7:30 గంటల నుంచే షోలు పడనున్నాయి.

టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేయడంతో, బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే థియేటర్లు ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి. బుక్‌మైషోలో కేవలం 24 గంటల్లోనే సుమారు 15 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్ 255K డాలర్లు దాటాయి.ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటివరకు దాదాపు రూ.5 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు కాగా, కోలీవుడ్ నటుడు పార్తిబన్ విలన్‌గా చేశారు.

మల్టీప్లెక్స్ చైన్స్ అయిన పీవీఆర్-ఐనాక్స్, సినీపోలిస్‌లలో బుకింగ్స్ త్వరలో ఓపెన్ కానున్నాయి.మరోవైపు ‘దురంధర్ 2’ కూడా గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. 2025లో వచ్చిన బ్లాక్ బస్టర్‌కు ఇది డైరెక్ట్ సీక్వెల్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.130 కోట్ల ప్రీ-సేల్స్ మార్క్ దాటేసింది. ఇండియాలో మార్చి 18న వేసే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే రూ.40 కోట్లకు పైగా రాబట్టనుంది.

‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus