Vaishnav Tej: ఆ డైరెక్టర్లు కావాలంటున్న వైష్ణవ్ తేజ్!

  • September 28, 2021 / 12:45 PM IST

ఉప్పెన సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కొండపొలం వచ్చే నెల 8వ తేదీన దసరా పండుగ కానుకగా రిలీజ్ కానుంది. వైష్ణవ్ తేజ్ కు జోడీగా ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో నటించారు. మూడవ సినిమాకు తమిళంలో అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించిన గిరీశయ్య దర్శకత్వం వహిస్తుండగా ఆ తరువాత సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

సురేందర్ రెడ్డి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉండగా ఆ రెండు సినిమాలు పూర్తైతే మాత్రమే వైష్ణవ్ సురేందర్ రెడ్డి కాంబో మూవీ మొదలవుతుంది. అయితే భవిష్యత్తు ప్రాజెక్టులకు మాత్రం స్టార్ డైరెక్టర్లు కావాలని వైష్ణవ్ తేజ్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త దర్శకుల డైరెక్షన్ లో నటిస్తే కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడం ద్వారా మార్కెట్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి.

వైష్ణవ్ ఏకైక డిమాండ్ ను తీర్చే నిర్మాతలు ఎవరో తెలియాల్సి ఉంది. ఒక్కో సినిమాకు వైష్ణవ్ తేజ్ 4 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ను పెంచే అవకాశాలు ఉంటాయి. కొండపొలం సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. రోజురోజుకు వైష్ణవ్ తేజ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus