మొత్తానికి పవన్ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేసాడు…!

  • April 21, 2020 / 06:03 PM IST

అసలు ఈ లాక్ డౌన్ పరిస్థితి లేకుంటే.. ఈ పాటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ హడావిడి మొదలై ఉండేది. తొలిసారి పవన్ లాయర్ గా నటిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ‘ఓ మై ఫ్రెండ్’ ‘ఎం.సి.ఏ’ వంటి చిత్రాలను తెరకెక్కించిన వేణూ శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు.దిల్ రాజు , బోణి కపూర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మగువా’ కు మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో హీరోయిన్ రోల్ కు శృతీ హాసన్ ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో ఆమె పాత్రను ట్రిమ్ చేస్తున్నారు అని కూడా ప్రచారం జరిగింది. దానికి దర్శకుడు వేణూ శ్రీరామ్ క్లారిటీ ఇచ్చాడు. ” ‘వకీల్ సాబ్’ లో శృతీ హాసన్ నే హీరోయిన్ గా అనుకుంటున్నాం. లాక్ డౌన్ పూర్తయ్యాక ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తాం.

పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం నా జన్మ జన్మల అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన కమిట్మెంట్ కు హ్యాట్సాఫ్ కొట్టాలి. ‘జనసేన’ పార్టీ పనుల్లో ఉదయం పాల్గొని… మళ్ళీ మధ్యాహ్నం షూటింగ్ కు రావడం.. అలాగే ఉదయం షూటింగ్ ఉంటే.. మళ్ళీ సాయంత్రానికి ఆ పనులకి వెళ్ళడం చేసారు. ఆయన చాలా కష్టపడ్డారు అనే చెప్పాలి.ఇక సినిమాకి సంబంధించి కొద్ది షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.” అంటూ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు వేణూ శ్రీరామ్.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus