షాకింగ్ : ‘వాల్మీకి’ విడుదల క్యాన్సిల్ .. పెద్ద దెబ్బే!

  • September 19, 2019 / 05:27 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘వాల్మీకి’. కోలీవుడ్ హీరో అధర్వ మురళి మరో హీరోగా నటిస్తున్నాడు. సెప్టెంబర్ 20న(రేపు) విడుదల కాబోతున్న ఈ చిత్రానికి పెద్ద షాక్ తగిలింది. ఈ చిత్రం విడుదల నిలిపివేయాలంటూ నోటీసులు అందడం చిత్ర యూనిట్ ను టెన్షన్ లోకి నెట్టేసింది. అయితే అన్ని చోట్ల కాదండోయ్… ఒక్క అనంతపురంలోనే..! మొదటి నుండీ ఈ చిత్రం టైటిల్ విషయంలో అనేక వివాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ‘వాల్మీకి’ అనే టైటిల్ పెట్టడం పై బోయ కులానికి చెందిన ప్రజలు కేసులు పెట్టారు. అంతేకాదు అనంతపురం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్న తరుణంలో కూడా వాళ్ళు అడ్డుపడి షూటింగ్ కు అంతరాయం కలిగించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక తాజాగా ఈ చిత్రాన్ని అనంతపురం పరిసర ప్రాంతాల్లో విడుదల చేయకూడదని ఆ జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ నోటీసులు పంపారు. ‘శాంతి భద్రతల నియంత్రణ లో భాగంగా అనంతపురం జిల్లాలో ‘వాల్మీకి’ సినిమా ప్రదర్శనను నిలుపుదల చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. దీంతో చిత్ర యూనిట్ కు పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో వరుణ్ కు జోడీగా పూజా హెగ్దే నటిస్తుంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ’14 రీల్స్ ప్లస్’ సంస్థ నిర్మించింది.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus