వరలక్ష్మీ శరత్ కుమార్(Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సరస్వతి’ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి కథ అందించిన స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్.. ‘నా కథతో సినిమా మొదలైంది. కానీ దానిని మానభంగం చేశారు’ అంటూ ఘాటు కామెంట్స్ చేశారు.
దీంతో వరలక్ష్మీ పై కొంత నెగిటివిటీ ఏర్పడింది. అందుకే ఆమె ఈరోజు థాంక్యూ మీట్ పెట్టి మరీ బుర్ర సాయి మాధవ్ వ్యవహారం పై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ విషయం పై స్పందిస్తూ.. ” నాకు బుర్రా సాయి మాధవ్ గారిపై చాలా మర్యాద ఉంది. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ రైటర్. కాబట్టి.. నేను ఆయన్ని చాలా గౌరవిస్తాను. కానీ కొన్ని కథలను రైటర్ అనుకునే విధంగా ప్రెజెంట్ చేస్తే.. ఆడియన్స్ కి నచ్చవు. అది పచ్చి నిజం. కాబట్టి.. ఆయన కథని మేము తీసుకున్నాం. అందుకు డబ్బులు కూడా చెల్లించాము. ఫస్ట్ మేము ఆయన కథని దొబ్బేయలేదు.
అలా ఆ కథని మేము ఓన్ చేసుకున్నాం. వాస్తవానికి ఈ కథ ఆయన దగ్గర 6 ఏళ్ళు ఉంది. అంత నచ్చినప్పుడు ఆయన ఎందుకు ఆ కథని తెరకెక్కించలేదు.? సో ఎక్కడో ఏదో ఇబ్బంది ఉంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే.. ‘సెకండాఫ్ బాగోలేదు’ అనే కారణంతో ఈయన స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేస్తూ వచ్చారు అని నాకు తెలిసింది. నేను అబద్దాలు చెప్పను అని ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. రైటర్ అన్నప్పుడు మా వద్దకి వచ్చి స్క్రిప్ట్ పై వర్క్ చేయాలి.
కానీ ఆయన చాలా బిజీ. ఆయన పెద్ద సినిమాలు చేస్తున్నారు. నన్ను ఎప్పుడూ కలిసింది లేదు. ఈ సినిమా కథ నాకు ఆడియో ఫైల్ రూపంలో పంపారు. సో నేను లైన్ తీసుకున్నాను. ఇప్పటి జనాలకి నచ్చేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకున్నాను. అయినప్పటికీ కథ అనే సెక్షన్లో నేను ఆయన పేరే వేశాను. అది నేను ఆయనకి ఇచ్చిన గౌరవం. అలాంటిది ఆయన ‘రేప్’ అంటూ పదాలు వాడటం కరెక్ట్ కాదు. ఇలాంటి స్టేట్మెంట్లు నేను ఆయన నుండి ఊహించలేదు” అంటూ చెప్పుకొచ్చారు.