వరుస చిత్రాలతో దూకుడు మీదున్న మెగా ప్రిన్స్

  • May 8, 2019 / 05:30 PM IST

ప్రస్తుతం ‘జిగర్తాండ’ రీమేక్ అయిన ‘వాల్మీకి’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. జులై తో ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం. ఈ చిత్రంలో నెగటివ్ పాత్రలో వరుణ్ కనిపించనున్నాడని… సినిమాకి హైలెట్ గా వరుణ్ తేజ్ నిలుస్తాడని టాక్ నడుస్తుంది. ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆగష్టు లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఓ పక్క ఈ చిత్రాన్ని ఇలా పూర్తి చేస్తున్నాడో లేదో.. వెంటనే మరో పక్క తన కొత్త చిత్రాన్ని ప్రారంభించడానికి రెడీ అయిపోయాడు వరుణ్ తేజ్.

నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. వరుణ్ బాక్సర్ గా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఇప్పటికే కాలిఫోర్నియా వెళ్ళి ఈ చిత్రం కోసం బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. ఆగష్టు నుండీ సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం హైదరాబాద్ , వైజాగ్ , ఢిల్లీ వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరుపోకుంది. ఈ చిత్రంలో తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషించనున్నాడు. ఇటీవల విడుదలైన ‘జెర్సీ’ చిత్రంలో కూడా సత్యరాజ్ మంచి పాత్ర పోషించాడు. ఏదేమైనా వరుణ్ తేజ్ వరుస చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాడన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus