2021 దసరాకి ‘వేదాలం’ రీమేక్ రెడీగా ఉంటుందట..!

  • November 5, 2020 / 06:42 PM IST

కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం పూర్తయిన వెంటనే మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదాలం'(తమిళ్) రీమేక్ ను మొదలుపెట్టాలని చిరు భావిస్తున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అయ్యింది. చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేష్ ను కూడా ఎంపిక చేసుకున్నారు. ‘ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. 2021 మార్చి నుండీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట.

కేవలం 4 నెలల్లోనే షూటింగ్ మొత్తం ఫినిష్ అయ్యేలా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని కూడా త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం.ఇదిలా ఉండగా.. నవంబర్ 9 నుండీ ‘ఆచార్య’ చిత్రం షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నారు మెగాస్టార్. ఫిబ్రవరి నాటికి ఈ చిత్రం షూటింగ్ ఫినిష్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. కాబట్టి దర్శకుడు మెహర్ రమేష్ ను రెడీగా ఉండమని.. చిరు చెప్పినట్టు తెలుస్తుంది. కలకత్తా నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉంటుంది కాబట్టి..

మొదట కొంత భాగాన్ని అక్కడ షూట్ చెయ్యాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. 2021 దసరా కానుకగా ‘వేదాలం’ రీమేక్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. మణిశర్మ కొడుకు మహాతి సాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికైనట్టు కూడా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus