నిర్మాణంలోకి దిగనున్న విక్టరీ వెంకటేష్

  • December 30, 2016 / 11:15 AM IST

ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు 14 భాషల్లో చిత్రాలు నిర్మించి గిన్నిస్ అవార్డు అందుకున్నారు. ఆయన తనయులైన సురేష్ బాబు, వెంకటేష్ సినీ రంగంలోనే స్థిరపడ్డారు. సురేష్ నిర్మాణం వైపు అడుగులు వేయగా, వెంకీ హీరోగా అలరించారు. అనేక హిట్ చిత్రాల్లో హీరోగా మెప్పించిన వెంకటేష్ తొలిసారిగా  నిర్మాతగా మారుతున్నారు. ఇప్పటివరకు ఇంటి లెక్కలు కూడా పట్టించుకోని వెంకటేష్ నిర్మాణంలోకి అడుగుపెట్టడానికి కారణం ఏమిటి అని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. స్పీడ్ డైరక్టర్ పూరి చెప్పిన కథే దీనికి కారణమని తెలిసింది. ప్రస్తుతం వెంకటేష్ గురు చిత్రాన్ని కంప్లీట్ చేసి “ఆడాళ్ళు నీకు జోహార్లు” అనే మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఈ తరుణంలో తర్వాత మూవీ కోసం కొంతమంది దర్శకుల కథలు విన్న వెంకీకి, పూరి చెప్పిన స్టోరీ బాగా నచ్చిందంట. ఆ సినిమాను ఎలాగైనా తమ బ్యానర్లోనే తీయాలని అన్నయ్య సురేష్ బాబుకి చెప్పగా.. బడ్జెట్ 50 కోట్లు అవుతుందని ఆయన వద్దన్నారు. వెంకీకి మాత్రం మనసు ఆ స్టోరీ పైనే ఉంది. సో.. తానే స్వయంగా డబ్బులు పెట్టి సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యారు. దీంతో సురేష్ బాబు తమ్ముడి ఆసక్తిని అర్ధం చేసుకొని ఇద్దరూ కలిసి నిర్మించేలా డిసైడ్ అయ్యారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus