నవ్వులు పూయించడానికి దంపతులైన వెంకటేష్, తమన్నా

  • May 18, 2018 / 11:09 AM IST

గురు సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ అనేక కథలను పరిశీలించారు. రెండు సెట్స్ మీదకు వెళ్లి ఆగిపోయాయి. తాజాగా అనిల్ రావిపూడి  దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో వరుణ్ తేజ్, వెంకీతో కలిసి హంగామా చేయనున్నారు. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి తో వరుణ సినిమా చేస్తున్నారు. ఈ షెడ్యూల్ గ్యాప్ లో మల్టీస్టారర్ మూవీలో నటించనున్నారు.  పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి

ఈ చిత్రానికి ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) పేరు ఫిక్స్ చేశారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఇందులో వెంకటేష్ సరసన తమన్నా నటిస్తోంది. సాధారణంగా ప్రేయసి, ప్రియుడిగా నటిస్తుంటారు. కానీ తమన్నా ఇందులో వెంకీకి భార్యగా కనిపించనుంది. వీరి జంట వెండితెరపై చేసే హంగామా ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుందని తెలిసింది. అలాగే వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటించనుంది. ఈ జంట కూడా  కన్ఫ్యూజన్  కామెడీతో క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా నవ్విస్తారని సమాచారం. ఫ్రస్టేషన్ తో V2 చేసే F2   కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus