సినీ పరిశ్రమని విషాదాలు విడిచి పెట్టడం లేదు.ఈ మధ్య ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. ఈ మధ్య చాలా మంది మరణించారు. అందులో మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ విలన్ ముకుల్ దేవ్ వంటి వారు ఉన్నారు. ఇప్పుడు మరో సీనియర్ నటుడు మృతి చెందినట్టు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. తమిళ నటుడు రాజేష్ (Rajesh) ఈరోజు కన్నుమూశారు. కొన్నాళ్ళుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన… పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన వయసు 75 ఏళ్ళు. తమిళంతో పాటు పలు భాషల్లో కలుపుకుని 150కి పైగా సినిమాల్లో నటించారు రాజేష్. మొన్నామధ్య ఈయన రజినీకాంత్ గురించి చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. రాజేష్ కు రజినీకాంత్ (Rajinikanth) క్లోజ్ ఫ్రెండ్ అని…చెప్పారు. వీరికి సంబంధించిన కొన్ని క్లిప్పులు కూడా వైరల్ అవుతున్నాయి.
రాజేష్ మృతి చెందడంతో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాధిక శరత్ కుమార్ (Radhika) రాజేష్ మృతి పట్ల స్పందిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. 1974లో అవల్ ఒరు తొడరకథై అనే సినిమాలో సైడ్ ఆర్టిస్ట్గా నటించి కెరీర్ను ప్రారంభించారు రాజేష్. అటు తర్వాత 1979 లో వచ్చిన ‘కన్ని పరువత్తిలే’ అనే సినిమాలో హీరోగా కూడా చేశారు. తమిళంతో పాటు మలయాళ, కన్నడ, తెలుగు చిత్రాల్లోనూ ఈయన నటించడం జరిగింది.