బాలీవుడ్ ని వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఓ ప్రక్క కరోనా వైరస్ కారణంగా ముంబై స్థంభించిపోగా, చిత్ర పరిశ్రమ కుదేలయింది. దీనికి తోడు బాలీవుడ్ లో సంభవిస్తున్న వరుస మరణాలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. నెలల వ్యవధిలో బాలీవుడ్ లో అనేక మంది మృత్యువాత పడ్డారు. ఒకరోజు తేడాతో ఇర్ఫాన్ ఖాన్ మరియు రిషి కపూర్ మరణించగా గత నెలలో యంగ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకోని బాలీవుడ్ ని తీవ్ర విషాదంలో నింపారు.
కాగా నేడు బాలీవుడ్ నుండి మరో లెజెండ్ నిష్క్రమించారు. దశాబ్దాలుగా బాలీవుడ్ కి కొరియోగ్రాఫర్ గా సేవలు అందిస్తున్న సరోజ్ ఖాన్ మరణించడం జరిగింది. నేడు ఉదయం ఆమె గుండె పోటుతో మరణించారు. 71ఏళ్ల సరోజ్ ఖాన్ కి కొద్దిరోజుల క్రితం శ్వాస ఇబ్బందిగా మారడంతో ముంబైలోని ఓ ప్రముఖ హాస్పిటల్ నందు అడ్మిట్ అయ్యారు. కొద్దిరోజులుగా ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
కాగా నేటి ఉదయం ఆమెకు గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది ఆమె మరణాన్ని వైద్యులు మరియు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. 40ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో సరోజ్ ఖాన్ 2000లకు పైగా పాటలకు నృత్యం అందించారు. మూడుసార్లు ఆమె ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. ‘డో లారే డో’, ‘ఏక్ డో తీన్’ వంటి బాలీవుడ్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఆమె నృత్యం అందించడం విశేషం.
1
2
3
4
5
6
7
8
9
10