సావిత్రి కోసం నాలుగు కోట్లా..?

  • July 30, 2016 / 07:04 AM IST

‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో విమర్శకుల ప్రశంసలు పొందాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ఓ భారీ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. మహానటి సావిత్రి బయోపిక్ ని తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే దీని స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ అయింది. ఇక ఈ సినిమాలో సావిత్ర పాత్ర కోసం పెద్ద కసరత్తే జరిగింది. చాలా మంది హీరోయిన్స్ తో సంప్రదింపులు జరిపారు.

అయితే ఎట్టకేలకు బాలీవుడ్ నటి విద్యాబాలన్ దగ్గర లాక్ అయ్యారని తెలిసింది. ఇటివలే ఆమెతో కలిసి కథా చర్చలు జరిపారని సమాచారం. దీనికి విద్యా కూడా అంగీకరించిందని టాక్. ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతుందట విద్యా. దాదాపు నాలుగు కోట్లు డిమాండ్ చేసిందట. ఈ భారీ ఎమౌంట్ ను ఇవ్వడానికి చిత్ర బృందం అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి అశ్వినిదత్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus