Vijay Devarakonda: గొడవ పడే వాళ్ళని అడగండి… నాకేం తెలియదు!

  • August 10, 2023 / 04:56 PM IST

విజయ్ దేవరకొండ త్వరలోనే ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్నటువంటి నేపథ్యంలోపెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మీడియా సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఓ మీడియా ప్రతినిధి విజయ్ దేవరకొండ ను ప్రశ్నిస్తూ అనసూయతో జరిగినటువంటి గొడవ గురించి ప్రశ్నలు వేశారు.

ఈ సందర్భంగా ఆయన ప్రశ్నిస్తూ అసలు అనసూయతో గొడవ ఎలా జరిగింది? ఈ గొడవకు ఎప్పుడు పులిస్టాప్ పడుతుంది అంటూ ప్రశ్నలు వేశారు. ఇలా అనసూయతో వివాదం గురించి ప్రశ్నలు రావడంతో విజయ్ దేవరకొండ కూడా తన స్టైల్ లో సమాధానం చెప్పారు ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అనసూయతో వివాదం గురించి స్పందిస్తూ ఏమో మీరు గొడవ చేసే వాళ్ళని అడగాలి… ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏం నడుస్తుందో నాకేం తెలియదు అంటూ చాలా సింపుల్ గా సమాధానం చెప్పారు.

ఈ సమాధానంతో ఈయన ఈ గొడవ గురించి తననే అడగండి అంటూ పరోక్షంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం దేవరకొండ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకవిజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.

అయితే అనసూయ తరచు పరోక్షంగా (Vijay Devarakonda) విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ పోస్టులు చేయడం విజయ్ ఫ్యాన్స్ ఈమెను సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేయడం జరుగుతుంది. గతంలో విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఈమె చేసినటువంటి ట్వీట్ భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కోవడమే కాకుండా ఈమె సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus