Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ మరోసారీ కొత్తవాళ్లతోనేనట!

  • June 1, 2021 / 03:10 PM IST

హీరోగా దూసుకుపోతూనే, నిర్మాతగానూ స్టార్ అనిపించుకోవాలని చూస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. ‘అర్జున్‌ రెడ్డి’ వచ్చిన రగ్డ్‌ ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తూ మాస్‌ హీరో అనిపించుకున్నాడు విజయ్‌. అయితే నిర్మాతగా మాత్రం అనుకున్న స్థాయిలో ఎలివేషన్‌ రాలేదు. రెండు సినిమాలు ప్రొడ్యూస్‌ చేసినా… అవి చిన్న సినిమాలే. తొలి సినిమాతో డబ్బులు, పేరు పెద్దగా వచ్చింది లేదు. అయితే ఇప్పుడు మూడో సినిమాకు సిద్ధమవుతున్నాడు విజయ్‌. విజయ్‌ దేవరకొండ ‘కింగ్ ఆఫ్ ది హిల్’ అనే బ్యానర్ మొదలుపెట్టి తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాను నిర్మించాడు.

ముందుగా చెప్పుకున్నట్లు ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే ఆ సినిమాకు పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేశాయని అప్పట్లో విజయ్ తండ్రి గోవర్ధన్ చెప్పుకొచ్చారు. అయితే నిర్మాతగా ఫస్ట్ సినిమాతో సో సో అనిపించాడు విజయ్‌. అదే బ్యానర్ లో రెండో సినిమా తమ్ముడు ఆనంద్ దేవరకొండతో తీస్తున్నాడు విజయ్‌. అదే ‘పుష్పక విమానం’. ఈ సినిమాను దామోదర అనే దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

ఇప్పుడు విజయ్ నిర్మాతగా మూడో సినిమాను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. పృథ్వీ సేనా రెడ్డి అనే కొత్త దర్శకుడితో విజయ్‌ మూడో సినిమా చేస్తున్నాడట. ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే కనిపిస్తారట. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందట.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus