తన ఫేస్ బుక్ ద్వారా ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన విజయశాంతి..!

Advertisement

ఇటీవల జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకని మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కలిసి సూపర్ హిట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో గతంలో వీరి మధ్య నెలకొన్న కొన్ని రాజకీయ మనస్పర్థల పై క్లారిటీ ఇచ్చేసారు. ‘రాజకీయ రంగం స్నేహితులను కూడా విడదీస్తుందేమో కానీ.. సినిమా రంగం స్నేహితులని దగ్గర చేస్తుంది’ అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. మహేష్ బాబు వల్లే ఇదంతా సాధ్యం అయ్యిందని చిరు, విజయశాంతి లు మహేష్ కు థాంక్స్ చెప్పారు. ఇదిలా ఉండగా తాజాగా.. చిరు, మహేష్ లతో దిగిన ఫోటోని తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసిన విజయశాంతి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చారు.

దాదాపు 13 ఏళ్ళ తరువాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోన్న విజయశాంతి తన ఫేస్బుక్ ద్వారా స్పందిస్తూ … ” నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే… కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డం ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం. జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో… నటనకు డిక్షనరీ లాంటి మహానటుడు శివాజీ గణేషన్ గారు నన్ను “గ్రేట్ ఆర్టిస్ట్, నా దత్తపుత్రిక” అని సంబోధించినప్పుడు అంతకుమించి గౌరవంగా భావించాను. అలాగే కమర్షియల్ సినిమాల పరంగా ఎన్ని విజయాలు సాధించినా… లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్ లాంటి అభినందనలు పొందినా… ఆ మాటను తెలుగు సినిమాను కమర్షియల్‌ పరంగా, కలెక్షన్ల పరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడంతో ఆ పదాలకు ఒక విలువ, పదింతల మర్యాద లభించినట్లుగా భావిస్తున్నాను. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి ప్రశంసలు అందుకోవడం ఆనవాయితీ. కానీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫంక్షన్ లోనే మెగాస్టార్ ద్వారా నేను అభినందనలు అందుకోవడానికి అవకాశం కల్పించిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కృతజ్ఞతలు. “సరిలేరు నీకెవ్వరు” దర్శకుడు రావిపూడి గారితో పాటు… మొత్తం చిత్ర యూనిట్‌కు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus