Vijayendra Prasad: ‘కార్తికేయ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్..!

  • August 12, 2022 / 06:49 AM IST

ఈ మధ్య కాలంలో రాజమౌళి కుటుంబ సభ్యులు అయిన యం.యం.కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ లు ఏ సినిమా వేడుకకు హాజరైనా.. లేక ఎక్కడ ఏ విషయం పై స్పందించినా కాంట్రవర్సీని టచ్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ‘ఆర్.ఆర్.ఆర్’ ను ఓ గే సినిమా అన్న ఓ రచయిత పై కీరవాణి ఎలాంటి ట్వీట్ వేశాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో అయితే ‘మత్తు వదలరా’ సక్సెస్ మీట్ కి వెళ్ళినప్పుడు.. ‘ఇక్కడ సక్సెస్ మీట్లు పెట్టారు అంటే సినిమా ప్లాప్’ అంటూ కామెంట్లు చేశాడు.

ఇప్పుడు ‘కార్తికేయ 2’ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా వచ్చిన విజయేంద్ర ప్రసాద్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, ఆడియో ఈవెంట్ లను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ… “ఈ ఫంక్షన్ కు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.సహజంగా ఇలాంటి ఫంక్షన్స్ కు రమ్మన్నా.. ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కు రమ్మన్నా… చాలా అసహనంగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మొహాలు తెలిసిపోతూ ఉంటాయి సినిమా ఆడదని. కానీ మొహమాటానికి రావాలి.. సినిమా బాగా ఆడుతుందని చెప్పాలి, చెప్పక తప్పదు.

కానీ ఈ సినిమాకి(‘కార్తికేయ 2’) … మనసా-వాచా- కర్మణా.. సూపర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. సార్ మీ ప్రొడ్యూసర్స్ రాసుకోండి… సార్..! ఇక్కడ ఎంత కలెక్ట్ చేస్తుందో.. హిందీలో కూడా అంత కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా. సౌత్ సినిమాల విజయపరంపరను కంటిన్యూ చేస్తుంది. అద్భుతంగా ఉంది ట్రైలర్, చాలా చాలా బాగుంది. బెస్ట్ విషెస్ అందరికీ..! అనుపమ, నిఖిల్ చాలా బాగా చేశారు. కాల భైరవ మీ నాన్న పేరుని నిలబెట్టావ్. దర్శకుడు చందూ మొండేటిది మా కొవ్వూరు అని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. గోదావరి నీళ్లు తాగారు. టాలెంట్ లేకుండా ఎక్కడికి పోతుంది” అంటూ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus