బాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహించనున్న విజయేంద్రప్రసాద్!!

  • April 23, 2016 / 11:34 AM IST

రచయితగా “బాహుబలి, భజరంగీ భాయిజాన్” చిత్రాలతో ప్రపంచస్థాయిలో పేరు సంపాదించిన విజయేంద్రప్రసాద్.. దర్శకుడిగా మాత్రం ఓ మోస్తరుగా సైతం అలరించలేకపోయాడు. ఆయన దర్శకత్వంలో రూపొందిన “శ్రీకృష్ణ 2006, రాజన్న” చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి, దాంతో దర్శకుడిగానూ ఒక భారీ విజయాన్ని తన భాతాలో వేసుకోవాలన్న తపనతో.. “బాబ్రీ మసీదు” కూల్చివేత కథాంశంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నాడు విజయేంద్రప్రసాద్.

సన్నీడియోల్ ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ తనయుడు రాజమౌళి క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ కు వెళ్లనుంది.
ఇంతకుమునుపు కూడా రాజమౌళి.. తన తండ్రి దర్శకత్వం వహించిన “రాజన్న” చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు. ఇకపోతే.. విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించిన “వల్లి” చిత్రం జూలైలో విడుదల కానుంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags