‘ఆచార్య’ చిత్రంలో విలన్ ఫిక్స్..!

  • November 20, 2020 / 03:09 PM IST

కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చెయ్యబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.40శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా ఆగిపోయింది. ఈ మధ్యనే తిరిగి ప్రారంభించారు… కానీ మెగాస్టార్ ఇంకా జాయిన్ అవ్వలేదు. ఆయన కూడా కరోనా భారిన పడటం.. ఆ వెంటనే కోలుకోవడం జరిగింది. దీంతో కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

30 నిమిషాల పాటు చరణ్ పాత్ర ఉంటుందని దర్శకుడు కొరటాల శివ తెలిపాడు. ఇక చిరు సరసన మరోసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో విలన్ గా ఎవరు నటించబోతున్నది ఇప్పటి వరకూ చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించలేదు. మొదట జగపతి బాబు పేరు వినిపించింది. కానీ అతనితో ఈ ప్రాజెక్టు గురించి సంప్రదించలేదని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. అయితే ‘ఆచార్య’ చిత్రం కోసం చరణ్ విలన్ ను సంప్రదించబోతున్నట్టు తాజా సమాచారం.

వివరాల్లోకి.. ‘ఆచార్య’ సినిమాలో విలన్ గా తమిళ హ్యాండ్సమ్ హీరో అరవింద్‌ స్వామిని తీసుకున్నారని సమాచారం. ఈయన అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతాడు అని భావించి కొరటాల.. చరణ్ కు చెప్పాడట. రాంచరణ్ కూడా ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.. పైగా అరవింద స్వామితో ‘ధృవ’ సినిమా చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే అతన్ని సంప్రదించబోతున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus