Virata Parvam: ‘విరాటపర్వం’ సక్సెస్ ఆ నిర్మాతకి చాలా ముఖ్యమట..!

  • June 15, 2022 / 06:08 PM IST

‘విరాటపర్వం’.. రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ. 2019లో షూటింగ్ మొదలైతే ఇన్నేళ్ల తర్వాత రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. జూన్ 17న అంటే మరో రెండు రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, కోలు కోలు పాట, ట్రైలర్ బాగున్నాయి. సినిమా కచ్చితంగా బాగుంటుంది అనే హోప్ కూడా ఏర్పడేలా చేసాయి. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సినీ ప్రముఖులకు ఈ మూవీని స్పెషల్ స్క్రీనింగ్ వేశారు.

వాళ్ళ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ వాళ్ళు ఈ చిత్రం గురించి ట్వీట్లు వేసి ప్రమోట్ చేస్తుంది లేదు. ఒకవేళ రిలీజ్ కు ముందు రోజు వేస్తారేమో చూడాలి. ఇది పక్కన పెట్టేస్తే ఈ చిత్రం సక్సెస్ సాధించడం ‘ఎస్.ఎల్.వి’ బ్యానర్ అధినేత సుధాకర్ చెరుకూరి కి చాలా అవసరం. ఎందుకంటే ఎంతో ప్యాషన్ తో ఆయన ఇప్పటివరకు సినిమాలు చేసుకుంటూ వచ్చారు. సందీప్ కిషన్ తో ‘రన్’, శర్వానంద్ తో ‘పడి పడి లేచే మనసు’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి సినిమాలు నిర్మించాడు.

కానీ ఈ సినిమాలన్నీ ప్లాపులు అయ్యాయి. ‘విరాటపర్వం’ విషయంలో సురేష్ బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరించారు. ‘విరాటపర్వం’ నిర్మాత అంటే ఎక్కువగా అతని పేరే ప్రచారమైంది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయితే సుధాకర్ చెరుకూరి కి అతని బ్యానర్ కు మంచి పేరు వస్తుంది. ప్రస్తుతం అతను నాని తో ‘దసరా’, రవితేజ తో ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి చిత్రాలు నిర్మిస్తున్నారు. ‘విరాటపర్వం’ సినిమా కనుక హిట్ అయితే వాటిపై కూడా మంచి బజ్ ఏర్పడే అవకాశం ఉంటుంది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus