విశాల్ సరసన మిల్కీ బ్యూటీ..?

  • April 29, 2016 / 09:57 AM IST

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం త్రిభాషా చిత్రంగా తెరకెక్కుతున్న అభినేత్రి చిత్రంలో నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం విశాల్ నటించనున్న చిత్రంలో తమన్నాను ఎంపిక చేశారు. సూరజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో వీరిద్దరు జంటగా నటించనున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఈ చిత్రంలో మరో హీరోయిన్ పాత్రలో మడోనా సెబాస్టియన్ నటించనుంది. నంద గోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కత్తి సందై’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. హిప్ హాప్ ఆది ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా విశాల్ తో తమన్నా మొదటి సారి జత కడుతుండటం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus