సెన్సార్ పూర్తి చేసుకున్న కమల్ విశ్వరూపం సీక్వెల్

  • May 5, 2018 / 10:42 AM IST

విశ్వనటుడు కమల హాసన్ ఐదేళ్ల క్రితం ఉగ్రవాద నేపథ్యంలో విశ్వరూపం సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా వివాదాస్పదం గా ఉందని అనేక అడ్డంకులు ఎదుర్కొంది. చివరకి 2013 లో రిలీజ్ అయి విజయం సాధించింది. ఆ సమయంలోనే విశ్వరూపం సీక్వెల్ త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇతర ప్రాజెక్ట్స్ పై ద్రుష్టి పెట్టడం వల్ల సీక్వెల్ ఆలస్యమైంది. తాజాగా సినిమాలను వదిలి కమల్ హాసన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ప్రజా సేవ చేయడానికి సొంత పార్టీని పెట్టారు. దీంతో అతను నటించిన సినిమాలను రిలీజ్ చేసే పనిలో పడ్డారు. ముందుగా విశ్వరూపం 2 ని సిద్ధం చేశారు. ఈ మూవీ సెన్సార్ సభ్యుల ముందుకు వెళ్ళింది.

ఈ సినిమా హిందీ వెర్షన్‌కు సీబీఎఫ్‌సీ 17 కట్స్‌ ఇచ్చినట్లు సమాచారం. రాజకీయ, ఉగ్రవాదానికి సంబంధించి వివాదస్పద వ్యాఖ్యలు ఉండటంతో ఆ పదాల సన్నివేశాలను తొలగించినట్లు తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యే ఈ సినిమాకు ‘U’ సర్టిఫికెట్ లభించింది. హిందీలో సీబీఎఫ్‌సీ యూ/ఏ ఇవ్వనుందని టాక్. సెన్సార్ పనులు పూర్తి కావడంతో త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. దీని తర్వాత కమల హాసన్ శెభాష్ నాయుడు చిత్రాన్ని కంప్లీట్ చేసి పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus