జనతా గ్యారేజ్ లో మరో హైలెట్ సీన్

  • June 25, 2016 / 11:03 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ గురించి మరో ఆసక్తికరమైన సంగతి బయటికి వచ్చింది. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాల తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాను ఎన్టీఆర్ మాస్ అభిమానులకు నచ్చేలా మలుస్తున్నారు. సింహాద్రి తరహాలో ఇందులోనూ ఇంటర్వెల్ వద్ద భారీ ఫైట్ ను పెట్టారని.. జనతా గ్యారేజ్ లో ఈ  ఫైట్  హైలెట్ గా నిలుస్తోందని తెలిసింది.

ఆ సీన్ గురించి  చెప్పుకుంటుండగానే ఈ సినిమాలో మరో హైలెట్ సీన్ గురించి వార్త లీక్ అయింది. యంగ్ టైగర్ విదేశీయులతో వాలీబాల్ ఆడే సన్నివేశం సినిమాలో మరో హైలెట్ గా నిలువనుందని సమాచారం. ప్రస్తుతం సారధి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో బ్యాకాంక్ వెళ్లనుంది. అక్కడ ఒక పాట, ఫైట్ సెక్వెన్స్ చిత్రీకరించనున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తుండగా, సమంత, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ మొత్తం జులై చివరి నాటికి పూర్తి అయ్యేలా కొరటాల శివ బృందం కష్టపడుతోంది. జనతా గ్యారేజ్ పాటలను జులై 25 న  విడుదల చేసి, ఆగస్టు 12కి సినిమా మూడు భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus