చిరంజీవి (Chiranjeevi) ఏదైనా మాట అనే ముందు చాలా రకాలుగా ఆలోచిస్తారని, ఆయన మాట వెనుక మరో మాట మర్మం కూడా ఉంటుంది అని అంటుంటారు టాలీవుడ్లో. అయితే ఇటీవల ఆయన చేసిన కొన్ని కామెంట్స్ కాంట్రవర్శీగా మారాయి. అయితే ‘కుబేర’ (Kuberaa) సినిమా సక్సెస్ మీట్లో చాలా కంట్రోల్డ్గా మాట్లాడి మెప్పించారు. ఈ క్రమంలో ఆయన సునీల్ నారంగ్ గురించి, ఆయన నైజాం డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడారు. మధ్యలో బావ అల్లు అరవింద్ ప్రస్తావన కూడా వచ్చింది.
దీంతో ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కి చిరంజీవి (Chiranjeevi) రావడం.. ఆ సినిమా గురించి కాస్త గొప్పగా చెప్పడం కామన్. సినిమాల సక్సెస్ మీట్లకు వచ్చినప్పుడు ఆయన మాటలు కొత్తగా ఉంటాయి. సినిమా ప్రధాన నటీనటుల్ని, కీలక సాంకేతిక వర్గాన్ని ఆయన ప్రశంసల్లో ముంచెత్తుతారు. అలా ‘కుబేర’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి.
ఆయన సరదాగా అన్నారో లేక సీరియస్గా అన్నారో కానీ అల్లు అరవింద్ (Allu Aravind) పేరు ప్రస్తావనకు వచ్చింది.‘కుబేర’ (Kuberaa) సినిమా నిర్మాత సునీల్ నారంగ్ (Suniel Narang) గురించి, ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి చిరంజీవి (Chiranjeevi) ప్రస్తావించారు. నైజామ్లో ఒకప్పుడు వారి డిస్ట్రిబ్యూషన్ ద్వారానే తన సినిమాలు విడుదలై గొప్ప లాభాలు ఇచ్చాయని చిరంజీవి గుర్తు చేశారు. ఆ తర్వాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ద్వారా నైజామ్ ఏరియాలో పంపిణి మొదలుపెట్టాక నారంగ్ వాళ్లతో కనెక్షన్ తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు చిరు.
అయితే ఆ మాటల సమయంలో ‘ఇప్పుడెందుకు ఇవన్నీ’ అని సునీల్ నారంగ్ సరదాగా ఎక్స్ ప్రెషన్ పెట్టారు. వెంటనే చిరంజీవి రియాక్ట్ అవుతూ.. అప్పుడు అలా ఛాన్స్ మిస్సయినా ఇప్పుడు వాళ్ల పిల్లలతో సినిమాలు చేయడం ద్వారా థర్డ్ జనరేషన్ తోనూ తమ అనుబంధాన్ని కొనసాగిస్తున్నామని చిరంజీవి అన్నారు. దీంతో ఏషియన్ బ్యానర్ మీద చిరంజీవి ఏమన్నా సినిమా చేస్తారా లేక డిస్ట్రిబ్యూషన్ గురించే అలా అన్నారా అనే ప్రశ్న మొదలైంది. ఈ మాటకు చిరునే చెప్పాలి.
నాగార్జున ఎవరి కాళ్లకైనా దండం పెట్టాడంటే.. అది నారాయణ దాస్ నారంగ్ గారికి మాత్రమే..
నారంగ్ ఫ్యామిలీ మూడో జనరేషన్ తోనూ వర్క్ చేయాలని ఉంది.#Kuberaa #SekharKammula #Dhanush #NagarjunaAkkineni #RashmikaMandanna #Chiranjeevi #DeviSriPrasad pic.twitter.com/T5wOfY4k9Q
— Filmy Focus (@FilmyFocus) June 23, 2025