ఎన్టీఆర్ సతీమణి కోపానికి కారణం అదేనా !!

  • December 27, 2016 / 06:20 AM IST

నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ తనయులు తారక రామారావు(13), సౌమిత్ర ప్రభాకర్‌(11)ల పంచెకట్టు వేడుక తూర్పుగోదావరి జిల్లా, కరప మండలం, వేళంగిలో ఉంటున్న తాత యార్లగడ్డ ప్రభాకరరావు ఇంట్లో గత శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి కళ్యాణ్ రామ్ తో పాటు,  ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతితో కలిసి హాజరయ్యారు. కుటుంబ సభ్యుల, బంధు మిత్రుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు.

ఈ ఫంక్ష‌న్‌లో అంద‌రూ ఎంతో ఆనందంగా క‌నిపించారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి మాత్రం కనీసం ఒక్క ఫోటోలో కూడా నవ్వుతూ కనిపించలేదు. ఫంక్షన్ అయ్యే వరకు కూడా ఆమె చాలా సీరియ‌స్‌గా ఉన్నారు. ఈ విషయాన్ని వేడుకకు వచ్చిన వారు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ చిన్నారులతో కలిసి ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి తీసుకున్న ఫోటోలు బయటికి రావడంతో అంత సీరియస్ గా ఉండటానికి కారణం ఏంటీ? అనే సందేహాలు నెటిజనుల్లో చాలా మందికి వ‌చ్చాయి. ఈ ఫంక్షన్ కి రావడానికి ఆమెకు ఇష్టం లేదా? లేకుంటే భార్య భర్తల మధ్య గొడవలు ఏమన్నా ఉన్నాయా? అనే అనుమానాలను వ్యక్తం చేశారు.

దీనిపై ఎన్టీఆర్ సన్నిహితులు స్పందించారు. లక్ష్మి ప్రణతి ఎప్పుడూ మౌనంగా ఉంటారు.. అంతేకాకుండా తండ్రి (జానకి రామ్) లేని పిల్లల్ని చూస్తుంటే ఆమెకు బాధ కలుగుతోందని, అందుకే ఆ వేడుకలో నవ్వలేదని వివరించారు. ఆ విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దని, దీనిపై చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus