డైరక్టర్ మెహ్రీన్ కి ఎందుకు క్షమాపణలు చెప్పారంటే?

  • November 16, 2017 / 04:02 PM IST

ప్రస్థానంతో వెండితెరపై అడుగుపెట్టిన యువ హీరో సందీప్ కిషన్.. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ హిట్ తో మంచి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా హిట్ ఏమి లేకపోవడంతో ఆశలన్నీ తన తాజా చిత్రం C/O సూర్యా పెట్టుకున్నారు. సుసీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. ఇందులో కొని సీన్స్ తొలిగిస్తే సినిమా వేగం పుంజుకుంటుందని ఫీడ్ బ్యాక్ అందుకోవడంతో డైరక్టర్ కొన్ని సీన్స్ కి కత్తెర వేశారు. దాదాపు 15 నిమిషాల వరకు నిడివి సమయాన్ని తగ్గించారు.

ఇందులో ఎక్కువభాగం హీరోయిన్ మెహ్రీన్ నటించిన సన్నివేశాలు ఉండడంతో.. డైరక్టర్ బాధ పడ్డారు. ఆమె అడగకముందే తన బాధ్యతగా మెహ్రీన్ కి ఈ విషయం వివరించి.. క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. “మెహ్రీన్ 15 రోజులు ఎంతో కష్టపడి నటించారు, ఆ సీన్స్ తీస్తుంటే నాకే బాధేసింది. మరి ఆమెకి ఎలా ఉంటుంది” అని  సుసీంద్రన్ చిత్ర యూనిట్ తో చెప్పినట్లు తెలిసింది. ఇక సినిమా విషయానికి వస్తే  ప్రస్తుతం నిడివి తగ్గడంతో  C/O సూర్యా మరింత బాగా ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus