‘పవన్’పై ఆ నిర్మాతకు ఎందుకు కోపం!!!

  • June 20, 2016 / 08:02 AM IST

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఈ మధ్య అసలు టైమ్ బాలేదు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ఇంతకీ విషయం ఏమిటంటే…భారీ అంచనాలతో, తెలుగులోనే కాకుండా, హింది లో సైతం విడుదలయిన పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద మిగిల్చిన చేదు జ్ఞాపకాల్ని ఇంకా అభిమానులు మరచిపోలేకపోతున్నారు. అయితే ఆ సినిమా విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయి. దర్శకుడు మార్పు, అంతా తానై నడిపించిన పవన్ ఇలా మొత్తం కలిసి సినిమాను డిజాస్టర్ గా నిలిపాయి.

ఇదిలా ఉంటే ఆ తరువాత వెంటనే పవన్ ఎస్.జె సూర్యతో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించేసాడు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వాదన ప్రకారం ఈ సినిమా దర్సకున్ని పవన్ మార్చాడని, సూర్య స్థానంలో కొంచెం కష్టం’, ‘గోపాల గోపాల’ లాంటి సినిమాలను తెరకెక్కించిన డాలీ ని తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇదే విషయమై పవన్ పై నిర్మాత చాలా కోపంగా ఉన్నాడు అని, పవన్ తో గట్టిగానే డిస్కషన్స్ చేశాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క మరొక వాదన సైతం తెరపైకి వస్తుంది.

ప్రస్తుతం సూర్య స్థానంలో దర్శకుడు డాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు అంటే…మహేష్-మురుగదాస్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో యస్.జె.సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు, అంతేకాకుండా మరో తమిళ హీరో సినిమాలోనూ సూర్య విలన్ పాత్రలో నటిస్తూ ఉండడంతో, తనకి పవన్ మూవీతో పనిచేసే టైం అస్సలు లేకపోవడం వల్ల, ఈ కారణంగా ఖుషీ సీక్వెల్ ని సరిగా చిత్రీకరించలేనేమో అనే సందేహం యస్.జె.సూర్య లో రావడం వల్ల, పవన్ దర్శకుడి మార్పు చేసినట్లు సమాచారం.  చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus