అభిమానులకి ఇచ్చిన మాట సంగతేంటి ప్రభాస్?

  • July 8, 2020 / 12:14 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో తన 20 వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుంది. ఇక ఇండస్ట్రీకి వచ్చి 17ఏళ్ళు పూర్తయినా ప్రభాస్ చేసింది 19సినిమాలే..! ఇక 2013లో విడుదలైన ‘మిర్చి’ తర్వాత ఆరున్నరేళ్ళలో అయితే ప్రభాస్ చేసింది కేవలం మూడు సినిమాలే కావడం గమనార్హం. ఇందులో ‘బాహుబలి ది బిగినింగ్’ ‘బాహుబలి2’ మరియు ‘సాహో’. ఒక్క 3 సినిమాలకే 6 ఏళ్ళు కేటాయించాడు ప్రభాస్..! అవి కూడాభారీ బడ్జెట్ చిత్రాలు కావడం.. అలాగే ‘వాటి అప్డేట్స్ కోసం అభిమానులు పడిగాపులు కాయడం’ వంటివి మనం చూస్తూనే ఉన్నాం.

‘బాహుబలి’ పూర్తయిన తరువాత వేగంగా సినిమాలు చేస్తానని ప్రభాస్.. ఫ్యాన్స్ కి మాట ఇచ్చాడు . అయితే మళ్ళీ ‘సాహో’ చిత్రానికి రెండేళ్ళ సమయం కేటాయించాడు. ‘ ‘సాహో’ గ్రాఫ్ కూడా పెరిగిపోవడంతో తప్పలేదని ప్రభాస్ వివరణ ఇచ్చాడు. ఇక ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈసారి కచ్చితంగా వేగంగా సినిమా చేసి చూపిస్తాను అని చెప్పాడు. అయితే ‘ప్రభాస్ 20’ రెగ్యులర్ షూటింగ్ జరగడం లేదు. ‘మరి ఈసారైనా అభిమానులకిచ్చిన మాట.. ప్రభాస్ నిలబెట్టుకుంటాడా’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus