సొంతగడ్డపై సాయేష హిట్ కొట్టేనా..?

  • October 28, 2016 / 10:45 AM IST

హీరోయిన్లుగా ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు. అలాంటివారి విషయంలో తొలి సినిమా, తొలి విజయం వంటివి ఎవరికీ పెద్ద పట్టకపోవచ్చు. కానీ సినీ నేపథ్యం ఉన్నవారి విషయంలో మాత్రం అన్నీ లెక్కలోకి వస్తాయి. అయితే వీరికి ఆ నేపథ్యం బలమే అయినా అదృష్టం కూడా కొంత కలిసి రావాలి. అఖిల్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయేషాకి లేనిది అదే.సైరాబాను, దిలీప్ కుమార్ మనవరాలైన సాయేషా అక్కినేని వారసుడు అఖిల్ తో టాలీవుడ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కినేని అన్న ట్యాగ్, వినాయక్ లాంటి అగ్ర దర్శకుడు కావడంతో మరో ఆలోచన లేకుండా సైన్ చేసేసింది. తీరా విడుదలయ్యాక రిజల్ట్ రివర్స్ అయ్యింది. టాలీవుడ్ కి చుట్టపు చూపుగా వచ్చిందని ఈ సినిమా ఫలితాన్ని ఇక్కడే వదిలేసినా సాయేషకి సొంతగడ్డపై విజయం సాధించాల్సిన సమయం రానే వచ్చింది.

అజయ్ దేవగన్ నటిస్తూ దర్శకత్వం వహించిన ‘శివాయ్’లో సాయేష నటించింది.ఈ సినిమాకి నిర్మాతగానూ వ్యవహరించిన అజయ్ సాయేషాను అనేక పరీక్షలు పెట్టాకే ఆ పాత్రకు ఎంపిక చేశాడట. బాలీవుడ్ లో ఈ అమ్మడికి ఇదే తొలి సినిమా కావడంతో అందరి చూపు సాయేషా పైనే ఉంది. ఇప్పటికే సినీ ఓ తరం వారసులంతా అక్కడ తమ ప్రతిభతో సత్తా చాటుతున్నారు. ఈ పరిస్థితుల్లో సాయేషా సొంతగడ్డపై ఎలాంటి ఫలితం పొందనుందన్నది ఆసక్తికరంగా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus