Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Advertisement

మన దగ్గర పెద్ద హీరో, పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి సినిమాలు వచ్చినప్పుడు అదనపు షో కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరకు నిర్మాతలు వెళ్తుంటారు. వాటిని పరిశీలించి ప్రభుత్వాలు నిర్ణయం వెలువరిస్తుంటాయి. మ్యాగ్జిమమ్‌ తొలి వారంతంలోనే ఈ అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ప్రతి సినిమాకు నిర్మాతలు లేదా పంపిణీదారులు ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందే. ఈ సమస్య ఎక్కువగా సింగిల్‌ స్క్రీన్లకే. మల్టీప్లెక్స్‌ల్లో షోలు వేసేస్తుంటారు.

Tollywood

ఈ సమస్య యథాతథంగా లేకపోయినా తమిళ సినిమా పరిశ్రమలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ప్రముఖ నటుడు విజయ్‌ జోసెఫ్‌ తమిళనాడు సీఎం అయ్యాక ఈ విషయంలో ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. తమిళ సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం సాయం చేయండి అంటూ పలువురు కోలీవుడ్‌ ప్రముఖులు కోరిన నేపథ్యమో లేక తన ఆలోచనో కానీ.. ఇండస్ట్రీ కోసం ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు.

తమిళనాడులో విడుదలయ్యే ప్రతి తమిళ సినిమా ఐదు షోలను ప్రదర్శించుకునేలా అనుమతి ఇచ్చారు. మొదటి వారం వరకు ఈ అనుమతి అమలులో ఉంటుంది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం విజయ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఈ అడుగు పడింది అని తమిళ సినిమా వర్గాలు చెబుతున్నారు. ఇప్పుడు ఎలాంటి అదనపు అనుమతులు అక్కర్లేకుండానే, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, థియేటర్‌ యజమాన్యం కలసి అదనపు షోలను ప్రదర్శించుకోవచ్చు.

రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus