ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు అప్పుడే కథ, టైటిల్ గురించి చెప్పేస్తున్నారు..!

Advertisement

ఎన్టీఆర్ ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు.దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని ఎప్పుడు ఫినిష్ చేసి విడుదల చేస్తాడో తెలియక అయోమయంలో ఉన్నారు ఎన్టీఆర్,చరణ్ అభిమానులు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఎలాగూ ఎన్టీఆర్ సినిమా లేదని తేలిపోయింది కాబట్టి వచ్చే ఏడాది.. అభిమానులకు రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘అయినను పోయి రావలె హస్తినకు'(వర్కింగ్ టైటిల్) ఒకటి కాగా.. మరొకటి ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు.

ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ గురించి నిర్మాతలు ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఇండైరెక్ట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం స్టోరీ లైన్ తో పాటు టైటిల్స్ కూడా ఇవే అంటూ ఇప్పుడు ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రానికి ‘మిస్సైల్’‌ లేదా ‘పవర్ హౌస్’ అనే టైటిల్స్ అనుకుంటున్నారని తెలుస్తుంది. ఇందులో ‘మిస్సైల్’ అనే టైటిల్ కే నిర్మాతలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది.

‘న్యూక్లియర్ ప్లాంట్స్‌తో పాటు పర్యావరణ నేపథ్యంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో’ ఈ చిత్రం కథ ఉంటుందని సమాచారం. ‘కె.జి.ఎఫ్’ చిత్రంలో హీరో యష్ ను ఓ రేంజ్లో చూపించిన ప్రశాంత్ నీల్… మన యంగ్ టైగర్ ను కూడా ఓ రేంజ్లో చూపిస్తాడు అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus