Rakul Preet: బాలీవుడ్‌లో వచ్చే ఏడాది రకుల్‌ మేనియా అంట..!

  • October 7, 2021 / 03:16 PM IST

ఏ రంగంలోకి అడుగుపెట్టినా… తనదైన ముద్ర వేయడం రకుల్‌ప్రీత్‌ సింగ్‌కి అలవాటు. టాలీవుడ్‌లో తొలినాళ్లలో రకుల్‌ తనదైన ‘మార్క్‌’ వేసింది. గ్లామర్‌ పాత్రలు చేస్తూనే, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసింది. దీంతో రకుల్‌తో అంత ఈజీ కాదు అని మిగిలిన హీరోయిన్లకు అర్థమైపోయింది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అదే పనిలో ఉంది రకుల్‌. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ఆరు సినిమాలు చేస్తోందంటే విషయం అర్థం చేసుకోవచ్చు. రకుల్‌ ప్రీత్‌ ప్లానింగ్‌ చాలా పక్కగా ఉంటుంది.

అందుకే టాలీవుడ్‌లో అన్నేసి సినిమాలు వరుసగా చేసింది. ఇప్పుడు బాలీవుడ్‌లో ‘అటాక్‌’, ‘మేడే’, ‘థ్యాంక్‌ గాడ్‌’, ‘డాక్టర్‌ జి’, ‘సిండ్రెల్లా’తోపాటు మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇక్కడ విషయం ఏంటంటే… ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాది విడుదల అవుతున్నాయి. అవును ఈ ఆరు సినిమాలు 2022లోనే వస్తాయట. ఇప్పుడు అర్థమైందా… 2022 రకుల్‌ విశ్వరూపం ఎందుకో. ఒక హీరోయన్‌కి ఏడాదిలో ఆరు సినిమాలు విడుదలవ్వడం అంటే పెద్ద విషయమే.

బాలీవుడ్‌లో అయితే మరీనూ. మరి ఈ సినిమాలతో ఏ మాత్రం మెప్పిస్తుందో చూడాలి. ఇవి కాకుండా తెలుగులో చేసిన ‘కొండపొలం’ అక్టోబరు 8న వస్తోంది. తమిళంలో నటించి ‘అయలాన్‌’ కూడా రెడీ అవుతోంది. మరి ‘ఇండియన్‌ 2’విషయంలో సరైన స్పష్టత లేదు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus