Director Krish: డ్రగ్స్ కేసు క్రిష్ కెరీర్ పై ఎంతవరకు ప్రభావం చూపుతుంది..!
February 28, 2024 / 10:49 AM IST
|Follow Us
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు బయటకు రావడం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ పార్టీ జరిగే సమయంలో వివేదకానందతో క్రిష్ 8వ నిందితుడిగా ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. అయితే క్రిష్ మాత్రం.. ‘కేవలం స్నేహితులు పిలవడం వల్లే అక్కడికి వెళ్లానని, తర్వాత కార్ రాగానే వెళ్లిపోయానని ఆయన చెప్పుకొచ్చారు. టెస్టులకి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు పోలీస్ విచారణకు ఆయన హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఒకవేళ క్రిష్ (Director Krish) నిజంగానే డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఆయన సినిమాల సంగతి ఏంటి, ఆయన కెరీర్ ఏమవుతుంది అనే ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. క్రిష్ పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్నారు. కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. కానీ బడ్జెట్ సమస్యలు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వంటి కారణాల వల్ల ఈ సినిమా డిలే అవుతూ వస్తోంది.
పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా ‘హరి హర వీరమల్లు’ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి కానీ ఇప్పటికీ ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వలేదు. ఇక అనుష్క 50 చిత్రం ‘శీలావతి’ ని క్రిష్ డైరెక్ట్ చేయాలి. షూటింగ్ కి అంతా సిద్ధం అనుకున్న టైంలో క్రిష్ .. ఇలా డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం జరిగింది. ఈ సినిమా కోసం ఆల్రెడీ కొన్ని సెట్స్ కూడా వేశారు. షూటింగ్ కనుక డిలే అయితే నిర్మాతలకి బడ్జెట్ పెరిగిపోయే ఇబ్బంది కూడా ఉంది.