చరణ్, సుకుమార్ మూవీలో విలన్ గా అది పినిశెట్టి

  • February 1, 2017 / 02:15 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సుకుమార్ కాంబినేషన్లో మూవీ నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ కథలో టాలీవుడ్ క్యూట్ బ్యూటీ, అక్కినేని కోడలు సమంత నటిస్తుండడంతో ఈ చిత్రం పై క్రేజ్ పెరిగింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ గురించి మరో ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. ఇందులో చెర్రీకి విలన్ గా ఆది పినిశెట్టి నటించబోతున్నట్లు తెలిసింది. హీరోగా చిత్ర సీమలో అడుగుపెట్టిన ఈ నటుడు సరైనోడు మూవీ ద్వారా ప్రతికథానాయకుడిగా మారారు.

అల్లు అర్జున్ తో పోటీ పడి నటించి సినిమా విజయానికి దోహదం చేశారు. ఇప్పుడు మరోసారి మెగా హీరోతో తలపడనున్నారు. ఈ విషయాన్నీ త్వరలో చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది, మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. పల్లెటూరి అందాలను తన కెమెరా పనితనంతో అద్భుతంగా చూపించనున్నారు. నాన్నకు ప్రేమతో వంటి హిట్ తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus